విశాఖ గ్యాస్ లీక్...కంపెనీపై కేసు నమోదు: సీపీ ఆర్కే మీనా

ABN , First Publish Date - 2020-06-30T13:09:47+05:30 IST

విశాఖ గ్యాస్ లీక్...కంపెనీపై కేసు నమోదు: సీపీ ఆర్కే మీనా

విశాఖ గ్యాస్ లీక్...కంపెనీపై కేసు నమోదు: సీపీ ఆర్కే మీనా

విశాఖపట్నం: విశాఖ సాయినార్ కంపెనీలోని బాయిలర్‌లో గ్యాస్ లీకవడంతో ప్రమాదం జరిగిందని సీపీ ఆర్కే మీనా తెలిపారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే కలెక్టర్, సీపీ ఘటనా స్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సాయినార్ కంపెనీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని అన్నారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారని, నలుగురు కార్మికులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు పేర్కొన్నారు. మృతుల్లో షిఫ్ట్ ఇన్‌చార్జ్ నరేంద్ర గుంటూరు జిల్లా తెనాలి వాసి కాగా...కెమిస్ట్ గౌరీశంకర్ విజయనగరానికి చెందిన వ్యక్తిగా గుర్తించామన్నారు. మూడేళ్ల క్రితం ఇదే సంస్థలో రియాక్టర్ పేలి ఇద్దరు మృతి చెందారని... గతంలో జరిగిన ప్రమాదంపైనా విచారణ చేస్తున్నామని సీపీ ఆర్కే మీనా వెల్లడించారు. 

Updated Date - 2020-06-30T13:09:47+05:30 IST