విశాఖ డెయిరీ డైరెక్టర్పై కత్తులతో దాడి
ABN , First Publish Date - 2020-06-04T03:18:31+05:30 IST
బుచ్చయ్యపేట మండలం కొమళ్ళపూడిలో దారుణం జరిగింది. వైసీపీ నేత, విశాఖ డెయిరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణతో పాటు మరో ఇద్దరిపైనా ..
విశాఖ: బుచ్చయ్యపేట మండలం కొమళ్ళపూడిలో దారుణం జరిగింది. వైసీపీ నేత, విశాఖ డెయిరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణతో పాటు మరో ఇద్దరిపైనా దుండగులు కత్తులతో దాడి చేశారు.ఈ దాడిలో వీరందరికీ గాయాలయ్యాయి. వీరిని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం వీరికి చికిత్స కొనసాగుతోంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.