విశాఖపట్నానికి ఏ2 శని పట్టింది: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-03-06T00:05:04+05:30 IST

విశాఖపట్నానికి ఏ2 శని పట్టిందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. పెందుర్తి కూడలిలో చంద్రబాబు

విశాఖపట్నానికి ఏ2 శని పట్టింది: చంద్రబాబు

విశాఖ: విశాఖపట్నానికి ఏ2 శని పట్టిందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. పెందుర్తి కూడలిలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ విజయసాయిరెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలకు పాల్పడుతున్నారని, ఏపీలో ఏబీసీడీ రాజ్యం నడుస్తోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. దాడులతో టీడీపీ అభ్యర్థులను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో టీడీపీకి బ్రహ్మాండ విజయం అందించాలని కోరారు. నీతి, నిజాయితీకి విశాఖ మారు పేరు అని వ్యాఖ్యానించారు. విశాఖ అభివృద్ధికి టీడీపీ ఎంతో కష్టపడిందని చంద్రబాబు తెలిపారు. హుద్‌హుద్ సమయంలో విశాఖ కోసం ఎంతో కష్టపడ్డామన్నారు. 22 నెలల సీఎం జగన్ పాలనలో విశాఖ అభివృద్ధి శూన్యమని చంద్రబాబు తప్పుబట్టారు.

Updated Date - 2021-03-06T00:05:04+05:30 IST