విశాఖ: అరకు లోయలో బంద్ ప్రశాంతం
ABN , First Publish Date - 2020-09-29T15:14:12+05:30 IST
జీవో నెంబర్ 3 పునరుద్ధరణ కోసం తలపెట్టిన మన్యం బంద్ అరకులోయలో ప్రశాంతంగా సాగుతోంది.
విశాఖపట్నం: జీవో నెంబర్ 3 పునరుద్ధరణ కోసం తలపెట్టిన మన్యం బంద్ అరకులోయలో ప్రశాంతంగా సాగుతోంది. పర్యాటక ప్రాంతాలు, వ్యాపార వాణిజ్య సముదాయాలు, బ్యాంకులు మూతపడ్డాయి. ఆర్టీసీ సేవలను ఏజెన్సీ ప్రాంతంలో నిలిపివేశారు. తమ హక్కులను కాపాడుకునేందుకు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని గిరిజన జేఏసీ నాయకులు ఉద్ఘాటించారు. మన్యం బందులో గిరిజన జేఏసీ, గిరిజన సంఘాలు కాంగ్రెస్, టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.