నేటి నుంచి ఏపీపీజీఈ సెట్ పరీక్షలు ప్రారంభం

ABN , First Publish Date - 2020-09-28T12:40:45+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఏపీపీజీఈ సెట్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి.

నేటి నుంచి ఏపీపీజీఈ సెట్ పరీక్షలు ప్రారంభం

విశాఖపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఏపీపీజీఈ సెట్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇంజనీరింగ్, ఫార్మసీల్లో పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఈనెల 30వరకు  ప్రవేశపరీక్ష జరుగనుంది. ఉదయం, మధ్యాహ్నం జరగనున్న ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం విశాఖలో మూడు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరోవైపు నేటి నుంచి అంధ్రాయూనివర్శిటీ డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు జరుగనున్నాయి. వచ్చేనెల 9 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. 

Updated Date - 2020-09-28T12:40:45+05:30 IST