విశాఖ ఏజెన్సీలో రెండో రోజు పర్యటించిన ప్రవీణ్ ప్రకాష్

ABN , First Publish Date - 2020-08-05T23:17:10+05:30 IST

విశాఖ ఏజెన్సీలో ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ రెండో రోజు పర్యటించారు. జీకే వీధి పంచాయతీ గుమ్మల్లగొంది కాఫీ తోటలు, చాపగెడ్డ ఏపీఎఫ్‌డీసీ కాఫీ ఎస్టేట్‌ను పరిశీలించారు.

విశాఖ ఏజెన్సీలో రెండో రోజు పర్యటించిన ప్రవీణ్ ప్రకాష్

విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ రెండో రోజు పర్యటించారు. జీకే వీధి పంచాయతీ గుమ్మల్లగొంది కాఫీ తోటలు, చాపగెడ్డ ఏపీఎఫ్‌డీసీ కాఫీ ఎస్టేట్‌ను పరిశీలించారు. కాఫీ రైతులతో కాసేపు ముచ్చటించారు. ఏడాదికి కాఫీ, మిరియాలు సాగుపై వస్తున్న ఆదాయం, ఐటీడీఏ, గిరిజన సంక్షేమ శాఖ అందిస్తున్న ప్రోత్సాహకాల వివరాలను ప్రవీణ్ ప్రకాష్ అడిగి తెలుసుకున్నారు. అలాగే కాఫీ వీడింగ్ సస్యరక్షణ పనులు, కాఫీ దిగుబడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు రంజిత్ భాషా, ఐటీడీఏ పీఓ, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-05T23:17:10+05:30 IST