సంజయ్‌ దేనికోసం పాదయాత్ర చేశారో చెప్పాలి?: వినోద్‌కుమార్

ABN , First Publish Date - 2021-10-03T19:28:01+05:30 IST

బీజేపీ నేత బండి సంజయ్‌ దేనికోసం పాదయాత్ర చేశారో చెప్పాలి? ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ ప్రశ్నించారు.

సంజయ్‌ దేనికోసం పాదయాత్ర చేశారో చెప్పాలి?: వినోద్‌కుమార్

హైదరాబాద్: బీజేపీ నేత బండి సంజయ్‌ దేనికోసం పాదయాత్ర చేశారో చెప్పాలి? ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో కరువు, కరెంట్ సమస్యలుంటే పాదయాత్రలు జరిగాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆ సమస్యలు లేవన్నారు. సంజయ్‌ ఏ సమస్య మీద మాట్లాడాలో తెలియకే విద్యా, వైద్యం అంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం వైద్య కళాశాలలు పెంచి, డైగ్నోస్టిక్స్ ఏర్పాటు చేసిందని తెలిపారు. సంజయ్‌ ఎంపీగా ఉండి ఒక్క మెడికల్‌ కాలేజీ తీసుకురాలేదని వినోద్‌కుమార్ ఆరోపించారు.

Updated Date - 2021-10-03T19:28:01+05:30 IST