వినాయక చవితి చేసుకోవద్దని ఎవరూ చెప్పలేదు: అవంతి

ABN , First Publish Date - 2021-09-08T22:04:12+05:30 IST

వినాయక చవితి చేసుకోవద్దని ఎవరూ చెప్పలేదని, సామూహికంగా వద్దని మాత్రమే చెప్పామని మంత్రి అవంతి శ్రీనివాస్ వివరణ ఇచ్చారు.

వినాయక చవితి చేసుకోవద్దని ఎవరూ చెప్పలేదు: అవంతి

అమరావతి: వినాయక చవితి చేసుకోవద్దని ఎవరూ చెప్పలేదని, సామూహికంగా వద్దని మాత్రమే చెప్పామని మంత్రి అవంతి శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ఉన్న 36 పర్యాటక శాఖ హోటళ్లను పూర్తిగా ఆధునీకరిస్తామని ప్రకటించారు. హరిత హోటళ్లను బ్రాండింగ్ చేసేలా అధికారులను ఆదేశించామన్నారు. విశాఖ, పిచ్చుకలంక, సూర్యలంక, గండికోటతో పాటు 13 చోట్ల 5 స్టార్ హోటళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. క్రీడలను ప్రోత్సహించే పాఠశాలలకు అవార్డుల ఇస్తామని, కొత్త క్రీడా విధానం దసరా నాటికి తీసుకువస్తామని అవంతి శ్రీనివాస్ తెలిపారు.

Updated Date - 2021-09-08T22:04:12+05:30 IST