Vijayawada: ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో శాకాంబరీదేవి ఉత్సవాలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-07-22T13:05:33+05:30 IST

ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో శాకాంబరీదేవి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. 3 రోజుల పాటు శాకాంబరీదేవి ఉత్సవాలు జరగనున్నాయి. ఇంద్రకీలాద్రిపై ఆషాఢమాసాన్ని పురస్కరించుకొని శ్రీదుర్గామల్లేశ్వరస్వామి

Vijayawada: ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో శాకాంబరీదేవి ఉత్సవాలు ప్రారంభం

విజయవాడ: ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో శాకాంబరీదేవి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. 3 రోజుల పాటు శాకాంబరీదేవి ఉత్సవాలు జరగనున్నాయి. ఇంద్రకీలాద్రిపై ఆషాఢమాసాన్ని పురస్కరించుకొని శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నారు. అమ్మవారిని ఆకుకూరలు, పళ్లు, కూరగాయలతో బుధవారం అమ్మవారిని అలంకరణ చేశారు. తొలుత దాతలు ఇచ్చిన నిమ్మకాయలు, కూరగాయలకు వైదిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలో రుత్వికులు పూజాదికాలు నిర్వహించారు. చివరి రోజున ప్రత్యేకంగా ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించే పండ్లతో ప్రత్యేకంగా అలంకరించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.

Updated Date - 2021-07-22T13:05:33+05:30 IST