కోవిడ్ ఆస్పత్రిలో వృద్ధుడు మిస్సింగ్.. ఎట్టకేలకు..

ABN , First Publish Date - 2020-07-04T01:14:41+05:30 IST

కొవిడ్‌ ఆస్పత్రిలో వృద్ధుడు మిస్సింగ్ మిస్టరీ వీడింది. కోవిడ్ ఆస్పత్రిలోనే వృద్ధుడు వసంతరావు మృతదేహం లభ్యమైంది. గత నెల 25వ తేదీన వృద్ధుడు వసంతరావు మిస్ అయ్యాడు. అప్పటి నుంచి

కోవిడ్ ఆస్పత్రిలో వృద్ధుడు మిస్సింగ్.. ఎట్టకేలకు..

విజయవాడ: కొవిడ్‌ ఆస్పత్రిలో వృద్ధుడు మిస్సింగ్ మిస్టరీ వీడింది. కోవిడ్ ఆస్పత్రిలోనే వృద్ధుడు వసంతరావు మృతదేహం లభ్యమైంది. గత నెల 25వ తేదీన వృద్ధుడు వసంతరావు మిస్ అయ్యాడు. అప్పటి నుంచి వృద్ధుడి కుటుంబ సభ్యులు అతని కోసం గాలిస్తున్నారు. ఈ విషయంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో కూడా ప్రసారం కావడంతో ఆస్పత్రి అధికారులు స్పందించారు. వసంతరావు మృతదేహాన్ని ఆస్పత్రిలోనే గుర్తించారు. గత నెల 25న ఆస్పత్రిలో వృద్ధుడు వసంతరావు మృతి చెందాడు. అయితే అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని ఆస్పత్రి సిబ్బంది మార్చురీలోకి తరలించారు. విషయం వెలుగులోకి రావడంతో ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై స్వరత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - 2020-07-04T01:14:41+05:30 IST