మొదటి భార్య ఇంట్లో భర్త మృతిపై రెండవ భార్య అనుమానం

ABN , First Publish Date - 2022-01-19T19:34:21+05:30 IST

నగరంలోని మహంతిపురంలో సయ్యద్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు సయ్యద్‌కు ఇద్దరు భార్యలు ఉన్నారు.

మొదటి భార్య ఇంట్లో భర్త మృతిపై రెండవ భార్య అనుమానం

విజయవాడ: నగరంలోని మహంతిపురంలో సయ్యద్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు సయ్యద్‌కు ఇద్దరు భార్యలు ఉన్నారు. ఈనెల 15న మొదటి భార్య నసీమ ఇంట్లో సయ్యద్ మృతి చెందాడు. అయితే తొలుత సయ్యద్‌ది సహజమరణంగా రెండవ భార్య అస్లాం భావించింది. కాగా... సయ్యద్ మృతదేహంపై గాయాలు ఉన్నట్లు రెండవ భార్య గుర్తించింది. దీంతో సయ్యద్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ అస్లాం టు టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతుడు సయ్యద్‌కు, మొదటి భార్య నసీమకు మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-01-19T19:34:21+05:30 IST