Vijayawada: కేదారేశ్వరపేట ఫ్రూట్ మార్కెట్ వద్ద వివాదం

ABN , First Publish Date - 2022-05-26T15:36:50+05:30 IST

నగరంలోని కేదారేశ్వర పేట ఫ్రూట్ మార్కెట్ వద్ద వివాదం నెలకొంది.

Vijayawada: కేదారేశ్వరపేట ఫ్రూట్ మార్కెట్ వద్ద వివాదం

విజయవాడ: నగరంలోని కేదారేశ్వర పేట ఫ్రూట్ మార్కెట్ వద్ద వివాదం నెలకొంది. రోడ్లపై వ్యాపారాలు చేస్తూ చిరువ్యాపారులు ట్రాఫిక్‌‌కు ఆటంకం కలిగిస్తున్నారంటూ మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన మున్సిపల్ కమిషనర్... మార్కెట్ వద్దకు ఆక్రమణల నిర్మూలన దళ(వీఎంసీ) సిబ్బంది వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న సిబ్బంది... రోడ్లపై పండ్ల వ్యాపారం చేసే బుట్టలు లాక్కెళ్లారు. దీంతో వ్యాపారస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఎంసీ సిబ్బంది ఉన్న వాహనాన్ని చిరు వ్యాపారులు అడ్డుకున్నారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని వ్యాపారులకు సర్దిచెప్పడంతో పరిస్థితి సర్దుమణిగింది. 

Updated Date - 2022-05-26T15:36:50+05:30 IST