ఆమెతో సహజీవనం‌ చేస్తూనే... ఆమె కూతురిపై ఘాతుకం

ABN , First Publish Date - 2022-04-30T14:31:22+05:30 IST

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి మానవ మృగంగా మారాడు.

ఆమెతో సహజీవనం‌ చేస్తూనే... ఆమె కూతురిపై ఘాతుకం

విజయవాడ: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి మానవ మృగంగా మారాడు. తల్లితో సహజీవనం‌ చేస్తూనే... ఆమె కూతురిపై ఘాతుకానికి పాల్పడ్డాడు. బెదిరించి పది నెలలుగా బాలికపై అత్యాచారం చేశాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. నిన్న బాలికను బంధువులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా... మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక వయసు 17 సంవత్సరాలు. విషయం తెలిసిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడు కోమటి‌ సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2022-04-30T14:31:22+05:30 IST