స్వర్ణప్యాలెస్ యజమాని ఆచూకీ కోసం ప్రత్యేక బృందాల ఏర్పాటు
ABN , First Publish Date - 2020-08-13T18:29:09+05:30 IST
స్వర్ణ ప్యాలెస్ హోటల్లో అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి హోటల్ యజమాని ముత్తవరపు శ్రీనివాసరావు, హాస్పిటల్
విజయవాడ: స్వర్ణ ప్యాలెస్ హోటల్లో అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి హోటల్ యజమాని ముత్తవరపు శ్రీనివాసరావు, హాస్పిటల్ యజమాని రమేష్ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. హైదరాబాద్, విజయవాడ పరిసరాల ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల స్వర్ణ ప్యాలెస్లో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది కరోనా రోగులు మృతి చెందిన విషయం తెలిసిందే.