నేడు మచిలీపట్నం కోర్టుకు మోకా భాస్కర్ హత్య కేసు నిందితులు
ABN , First Publish Date - 2020-07-11T14:49:21+05:30 IST
నేడు మచిలీపట్నం కోర్టుకు మోకా భాస్కర్ హత్య కేసు నిందితులు
విజయవాడ: వైసీపీ నేత మోకా భాస్కర్ హత్య కేసులో ఏ-1, ఏ-2నిందితులు ఈరోజు మచిలీపట్నం కోర్టుకు హాజరుకానున్నారు. మూడు రోజుల పోలీస్ కస్టడీ కోరుతూ జిల్లా కోర్టులో పోలీసులు పిటిషన్ వేయగా...అందుకు న్యాయస్థానం అనుమతించింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చింత చిన్న, చింత పులిలను శనివారం మచిలీపట్నం తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి కీలకమైన వాస్తవాలు తెలుసుకునేందుకే పోలీసు కస్టడీ తీసుకుంటున్నామని పోలీసులు చెబుతున్నారు.