కాంగ్రెస్ నా గొంతు నొక్కింది: రాములమ్మ

ABN , First Publish Date - 2020-12-21T17:36:54+05:30 IST

పబ్లిక్‌లో మాట్లాడకుండా కాంగ్రెస్ తన గొంతు నొక్కిందని విజయశాంతి అన్నారు.

కాంగ్రెస్ నా గొంతు నొక్కింది: రాములమ్మ

హైదరాబాద్: పబ్లిక్‌లో మాట్లాడకుండా కాంగ్రెస్ తన గొంతు నొక్కిందని తెలంగాణ ఫైర్ బ్రండ్, బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. ఈ సందర్భంగా ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఉద్యమం నుంచి వచ్చిన మనిషిగా పార్టీకి ఉపయోగపడే విషయాలు చెబుతే వినిపించుకోలేదన్నారు. రాష్ట్రంలో అవినీతి జరుగుతుందని.. దానిపై పబ్లిక్‌లో మాట్లాడదామంటే.. హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. రాష్ట్రంలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారన్నారు. వాళ్లూ మాట్లాడలేదు.. తనని మాట్లాడనివ్వకుండా  చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కళ్ల ముందు తప్పు జరుగుతున్నప్పుడు అది చెప్పడానికి లేదని.. ఇలాంటివి కాంగ్రెస్ పార్టీలో చాలా సమస్యలు ఉన్నాయని విజయశాంతి తెలిపారు.

Updated Date - 2020-12-21T17:36:54+05:30 IST