వైసీపీ అభ్యర్థులను గెలిపించాలి: విజయసాయిరెడ్డి

ABN , First Publish Date - 2021-02-27T21:17:46+05:30 IST

జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులని గెలిపిస్తే మంచి నగర పాలన అందిస్తామని హామీ ఇస్తున్నామని రాజ్యసభ ఎంపీ..

వైసీపీ అభ్యర్థులను గెలిపించాలి: విజయసాయిరెడ్డి

విశాఖ: జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులని గెలిపిస్తే మంచి నగర పాలన అందిస్తామని హామీ ఇస్తున్నామని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. శనివారం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి, కే కే రాజు, వైసీపీ నేతలు భారీగా పాల్గొన్నారు.  ఈసందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. జీవీఎంసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తి అయిందని తెలిపారు. ఈ రోజు దక్షిణ నియోజకవర్గ కార్పొరేటర్లు జాబితా ప్రకటిస్తామన్నారు. గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకుని, పరిష్కరిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.వైసీపీ అభ్యర్థులని గెలిపించాలని కార్యకర్తలకు విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు.  

Updated Date - 2021-02-27T21:17:46+05:30 IST