నకిలీ ఓట్లపై స్పందించిన ఎన్నికల అధికారి
ABN , First Publish Date - 2021-04-17T19:06:59+05:30 IST
నకిలీ ఓట్లపై స్పందించిన ఎన్నికల అధికారి
అమరావతి: నకిలీ ఓట్లపై ప్రధాన ఎన్నికల అధికారి విజయానంద్ స్పందించారు. చిత్తూరు, నెల్లూరు కలెక్టర్లు, ఎస్పీలు, రిటర్నింగ్ అధికారులతో విజయానంద్ మాట్లాడారు. నకిలీ ఓట్లు వేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఈసీ అదేశించారు. తిరుపతి ఉపఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని ఆయన సూచించారు.