గౌతమ్ ఎంతో సౌమ్యులు.. : ఉపరాష్ట్రపతి

ABN , First Publish Date - 2022-02-21T15:35:04+05:30 IST

ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు.

గౌతమ్ ఎంతో సౌమ్యులు.. : ఉపరాష్ట్రపతి

అమరావతి: ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి మృతిపట్ల  ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి ఎంతో సౌమ్యులు, సంస్కారవంతులన్నారు. ప్రజా సమస్యల పట్ల అవగాహన, చేసే పని పట్ల నిబద్దత కలిగిన నాయకులని కొనియాడారు. గౌతమ్ రెడ్డి తాత గారి సమయం నుంచి వారి కుటుంబంతో సాన్నిహిత్యం ఉందని చెప్పారు. ‘‘గౌతమ్ రెడ్డి నేనంటే ఎంతో అభిమానం చూపేవారు...అలాంటి వ్యక్తి చిన్న వయసులోనే దూరం కావడం బాధాకరం’’ అని ఆవేదన చెందారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ఉపరాష్ట్రపతి వెంకయ్య సానుభూతి తెలియజేశారు. 

Updated Date - 2022-02-21T15:35:04+05:30 IST