వంగపండు మృతిపై విచారం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి
ABN , First Publish Date - 2020-08-05T02:07:40+05:30 IST
ప్రముఖ వాగ్గేయకారుడు, జానపద కళాకారుడు వంగపండు ప్రసాదరావు మృతిపై భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.
న్యూఢిల్లీ: ప్రముఖ వాగ్గేయకారుడు, జానపద కళాకారుడు వంగపండు ప్రసాదరావు మృతిపై భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు. ‘ప్రముఖ వాగ్గేయకారుడు, జానపద కళాకారుడు వంగపండు ప్రసాదరావు పరమపదించారని తెలిసి విచారిస్తున్నాను. ప్రజలను చైతన్యపరిచేందుకు ఆయన ఉత్తరాంధ్ర యాసలో పాడిన పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను.’ అని పేర్కొన్నారు.
ప్రముఖ వాగ్గేయకారుడు, జానపద కళాకారుడు వంగపండు ప్రసాదరావు గుండెపోటుతో ఇవాళ చనిపోయిన విషయం తెలిసిందే. ఆయన మృతిపట్ల కవి, గాయక, సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.