ఏపీ సీఎంని కలిసిన జాతీయ ఎస్సీ కమిషన్‌ ఉపాధ్యక్షుడు

ABN , First Publish Date - 2021-08-25T02:12:33+05:30 IST

సీఎం జగన్‌ను ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో జాతీయ ఎస్సీ కమిషన్‌ ఉపాధ్యక్షుడు

ఏపీ సీఎంని కలిసిన జాతీయ ఎస్సీ కమిషన్‌ ఉపాధ్యక్షుడు

అమరావతి: సీఎం జగన్‌ను ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో జాతీయ ఎస్సీ కమిషన్‌ ఉపాధ్యక్షుడు అరుణ్‌ హల్దార్, కమిషన్‌ సభ్యులు డాక్టర్‌ అంజూ బాల, సుభాష్‌ రామ్‌నాథ్‌ పార్ది మర్యాదపూర్వకంగా కలిసారు. వైస్‌ ఛైర్మన్, సభ్యులను జగన్‌ సన్మానించారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్‌ దండే, సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌ హర్షవర్ధన్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-25T02:12:33+05:30 IST