వంగపండు పరమపదించారని తెలిసి విచారిస్తున్నా: వెంకయ్యనాయుడు

ABN , First Publish Date - 2020-08-05T01:35:02+05:30 IST

ప్రముఖ వాగ్గేయకారుడు, జానపద కళాకారుడు వంగపండు ప్రసాదరావు పరమపదించారని ..

వంగపండు పరమపదించారని తెలిసి విచారిస్తున్నా: వెంకయ్యనాయుడు

న్యూఢిల్లీ: ప్రముఖ వాగ్గేయకారుడు, జానపద కళాకారుడు వంగపండు ప్రసాదరావు పరమపదించారని తెలిసి విచారిస్తున్నానని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రజలను చైతన్య పరిచేందుకు వంగపండు ఉత్తరాంధ్ర యాసలో పాడిన పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. వంగపండు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నానని వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. 


కాగా ప్రముఖ జానపద గేయ రచయిత, గాయకుడు వంగపండు ప్రసాదరావు గుండెపోటుతో మృతి చెందారు. పార్వతీపురంలోని తన స్వగృహంలో వంగపండు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ‘అర్ధరాత్రి స్వతంత్ర్యం’ చిత్రంతో వంగపండు సినీ ప్రస్ధానం ప్రారంభమైంది. విప్లవ కవిగా రెండు తెలుగు రాష్ట్రాలలో వంగపండు ప్రసాద్‌రావు ప్రత్యేక గుర్తింపు పొందారు. 



Updated Date - 2020-08-05T01:35:02+05:30 IST