వంగపండు పరమపదించారని తెలిసి విచారిస్తున్నా: వెంకయ్యనాయుడు
ABN , First Publish Date - 2020-08-05T01:35:02+05:30 IST
ప్రముఖ వాగ్గేయకారుడు, జానపద కళాకారుడు వంగపండు ప్రసాదరావు పరమపదించారని ..
న్యూఢిల్లీ: ప్రముఖ వాగ్గేయకారుడు, జానపద కళాకారుడు వంగపండు ప్రసాదరావు పరమపదించారని తెలిసి విచారిస్తున్నానని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రజలను చైతన్య పరిచేందుకు వంగపండు ఉత్తరాంధ్ర యాసలో పాడిన పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. వంగపండు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నానని వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.