Veniceలో కాలుపెట్టాలంటే టూరిస్టులు ఎంట్రీ ఫీజు చెల్లించాల్సిందే..

ABN , First Publish Date - 2022-07-04T03:09:12+05:30 IST

ఇటలీలోని ప్రఖ్యాత వెనిస్ నగరాన్ని సందర్శించేందుకు ప్రపంచం నలుమూలల నుంచీ పర్యాటకులు పోటెత్తుతుంటారు. ఈ క్రమంలో వీధులన్నీ టూరిస్టులతో కిటకిటలాడుతుంటాయి. ఇది రానురాను ఇబ్బందికరంగా మారుతున్న తరుణంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Veniceలో కాలుపెట్టాలంటే టూరిస్టులు ఎంట్రీ ఫీజు చెల్లించాల్సిందే..

ఎన్నారై డెస్క్: ఇటలీలోని ప్రఖ్యాత వెనిస్ నగరాన్ని సందర్శించేందుకు ప్రపంచం నలుమూలల నుంచీ పర్యాటకులు పోటెత్తుతుంటారు. ఈ క్రమంలో వీధులన్నీ టూరిస్టులతో కిటకిటలాడుతుంటాయి. ఇది రానురాను ఇబ్బందికరంగా మారుతున్న తరుణంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరానికి వచ్చే టూరిస్టులు ముందుగా ఎంట్రీ ఫీజు చెల్లించాలనే నిబంధన విధించేందుకు నిర్ణయించింది. ఇందుకు కోసం టూరిస్టులు ముందుగానే ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఈ ఎంట్రీ ఫీజు కనిష్ఠంగా రూ. 247, గరిష్ఠంగా రూ.823గా ఉంటుందని సమాచారం. పర్యాటకుల కారణంగా తలెత్తే రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటువంటి విధానాన్ని అమలు చేస్తున్న తొలి నగరం వెనిస్‌యేనని నగర పర్యటక శాఖ చీఫ్ మీడియాకు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 16 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది.   


Updated Date - 2022-07-04T03:09:12+05:30 IST