గొడ్డలితో వేసేసి గుండెపోటు అనడమా మీ క్రెడిబిలిటీ?: వర్ల
ABN , First Publish Date - 2022-07-10T00:50:47+05:30 IST
జగన్ నీతిపరుడైతే సీబీఐ విచారణకు ఎందుకు హాజరవ్వడం లేదు?అని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. చంద్రబాబు కుటుంబం ప్రకటించినట్లు జగన్ కూడా ఆస్తులు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
అమరావతి: జగన్ నీతిపరుడైతే సీబీఐ విచారణకు ఎందుకు హాజరవ్వడం లేదు?అని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. చంద్రబాబు కుటుంబం ప్రకటించినట్లు జగన్ కూడా ఆస్తులు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. మద్యం, ఇసుక, సిమెంట్ సిండికేట్ వ్యాపారం చేస్తున్నది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. టీడీపీ నేతలకు క్యారెక్టర్ లేదా? క్రెడిబిలిటీ లేదా?, చిన్నాన్నను గొడ్డలితో వేసేసి గుండెపోటు అనడమా మీ క్రెడిబిలిటీ? అని వర్ల రామయ్య ప్రశ్నించారు. జీవితకాల అధ్యక్షుడుగా ప్రకటించుకున్న జగన్ని మించిన పెత్తందారు లేరన్నారు.