రైతులకు సంకెళ్లు వేయడంపై ఎన్‌హెచ్‌ఆర్సీకి వర్ల రామయ్య ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-10-28T17:50:00+05:30 IST

రైతులకు సంకెళ్లు వేయడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తూ వర్ల రామయ్య లేఖ రాశారు. కరుడుకట్టిన నేరస్తులకు, దేశ భద్రతకు భంగం

రైతులకు సంకెళ్లు వేయడంపై ఎన్‌హెచ్‌ఆర్సీకి వర్ల రామయ్య ఫిర్యాదు

అమరావతి: రైతులకు సంకెళ్లు వేయడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తూ వర్ల రామయ్య లేఖ రాశారు. కరుడుకట్టిన నేరస్తులకు, దేశ భద్రతకు భంగం కలిగించే ఉగ్రవాదులకు వేసే సంకెళ్లు ఉద్యమం చేస్తున్న అమరావతి రైతులకు వేయడం దుర్మార్గమని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ ఫాసిస్టు ధోరణికి ఈ రైతులకు వేసిన సంకెళ్లే నిదర్శనం అని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఖరి మారాలని కోరారు. పలు దఫాలుగా సుప్రీంకోర్టు ఆదేశించినా రైతులకు సంకెళ్లు వేయడం న్యాయవ్యవస్థలను ధిక్కరించడమేనన్నారు. రాజ్యాంగంలోని 19వ ఆర్టికల్‌కు భంగం కలిగించి వారి హక్కులు హరించిన ప్రభుత్వంపై కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలంటూ లేఖలో వర్ల రామయ్య కోరారు. వీడియో క్లిప్పింగ్‌లు జతపరచి లేఖను పంపించారు.

Updated Date - 2020-10-28T17:50:00+05:30 IST