నన్ను చంపడానికి రెక్కీ నిర్వహించారు: వంగవీటి రాధ

ABN , First Publish Date - 2021-12-26T21:54:21+05:30 IST

టీడీపీ నేత వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడ్లవల్లేరు మండలం చినగొన్నురు గ్రామంలో దివంగత వంగవీటి

నన్ను చంపడానికి రెక్కీ నిర్వహించారు: వంగవీటి రాధ

కృష్ణా: టీడీపీ నేత వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడ్లవల్లేరు మండలం చినగొన్నురు గ్రామంలో దివంగత వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరించారు. ఈ సందర్భంగా రాధా మట్లాడుతూ నన్ను చంపడానికి రెక్కీ నిర్వహించారు. నన్ను ఏదో చేద్దామనుకుని రెక్కీ నిర్వహించారు. రంగా కీర్తి, ఆశయాల సాధనే నా లక్ష్యం.. పదవులు కాదు. నేను భయపడను.. అన్ని వేళలా సిద్ధం’’ అని రాధా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక పాల్గొన్నారు. వంగవీటి రాధాపై ఆశక్తికర కొడాలి నాని వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రాధా తనకు తమ్ముడని, తాను వైసీపీలో ఉన్నానని, రాధ టీడీపీలో ఉన్నాడు అనుకుంటా? అని అన్నారు.  కల్మషం లేని రాధ తాను నమ్మిన దారిలోనే నడుస్తున్నాడని నాని తెలిపారు. వంగవీటి రాధకు అభిమానులు అండగా నిలవాలని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోరారు.

Updated Date - 2021-12-26T21:54:21+05:30 IST