తెలుగుమహిళ ఆధ్వర్యంలో నారీ సంకల్పదీక్ష: అనిత

ABN , First Publish Date - 2022-01-25T20:24:27+05:30 IST

తెలుగుమహిళ ఆధ్వర్యంలో నారీ సంకల్పదీక్ష: అనిత

తెలుగుమహిళ ఆధ్వర్యంలో నారీ సంకల్పదీక్ష: అనిత

అమరావతి: మహిళాద్రోహి జగన్ రెడ్డి అరాచకపాలనను నిరసిస్తూ తెలుగుమహిళ ఆధ్వర్యంలో నారీ సంకల్పదీక్ష చేపటనున్నట్లు తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత వెలిపారు. ఈనెల 28వ తేదీన టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు దీక్ష చేపడతామన్నారు. పెద్దఎత్తన తెలుగు మహిళా ప్రతినిధులు, కార్యకర్తలు హాజరుకాలని పిలుపునిచ్చారు. తుగ్లక్ రెడ్డి పాలనలో మహిళల ఆత్మ గౌరవానికి భంగం కలిగిందన్నారు. మద్యపాన నిషేదంపై మాట ఇచ్చి మోసం చేశారని ఆమె మండిపడ్డారు. మహిళలకు ఆర్థిక చేయూత అందించిన డ్వాక్రా సంఘాలు నిర్వీర్యం చేస్తున్నాయన్నారు. నిత్యావసర ధరల పెంపుతో సామాన్యులపై మోయలేని భారం పడిందన్నారు. ఏపీని క్యాసీనోలు, పబ్‌లు, జూదాలకు వేదికగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. 


Updated Date - 2022-01-25T20:24:27+05:30 IST