రోడ్డు ప్రమాదంలో కాళ్లు, చేతులు కోల్పోయిన ఉత్తరప్రదేశ్ వ్యాపారి

ABN , First Publish Date - 2022-06-01T18:20:17+05:30 IST

జిల్లాలోని రాజాం మండలం పొగిరి దగ్గర బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యాపారి కాళ్లు, చేతులు కోల్పోయాడు.

రోడ్డు ప్రమాదంలో కాళ్లు, చేతులు కోల్పోయిన ఉత్తరప్రదేశ్ వ్యాపారి

విజయనగరం: జిల్లాలోని రాజాం మండలం పొగిరి దగ్గర బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యాపారి కాళ్లు, చేతులు కోల్పోయాడు. దుప్పట్ల వ్యాపారిని కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. కాగా ప్రమాదానికి కారణమైన కారులో ఓ ఎస్ఐతో పాటు కానిస్టేబుళ్లు ప్రయాణిస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు నిలదీస్తున్నా పట్టించుకోకుండా పోలీసుల కారు శ్రీకాకుళం వైపు పరారైంది. సమాచారం అందుకున్న 'స్థానిక పోలీసులు... గాయపడిన వ్యాపారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-06-01T18:20:17+05:30 IST