బీజేపీ మళ్ళీ అదే స్థానానికి వెళ్తుంది: ఉత్తమ్

ABN , First Publish Date - 2021-01-19T21:07:25+05:30 IST

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 100 సీట్లలో డిపాజిట్లు కోల్పోయిందని, మళ్ళీ అదే స్థానానికి వెళ్తుందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

బీజేపీ మళ్ళీ అదే స్థానానికి వెళ్తుంది: ఉత్తమ్

హైదరాబాద్: గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 100 సీట్లలో డిపాజిట్లు కోల్పోయిందని, మళ్ళీ అదే స్థానానికి వెళ్తుందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని కేసీఆర్ ప్రకటించడం దారుణం అన్నారు. రాష్ట్రంలో పండిన ప్రతి గింజ మద్దతు ధరకు కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. కార్పొరేషన్‌, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలన్నారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుంటే దేశంలో మాత్రం డీజిల్, పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని తెలిపారు.

Updated Date - 2021-01-19T21:07:25+05:30 IST