తెలంగాణలో అటవీ శాస్త్ర విశ్వ విద్యాలయం

ABN , First Publish Date - 2022-09-14T08:43:56+05:30 IST

తెలంగాణలో మరో విశ్వవిద్యాలయం పురుడు పోసుకుంది.

తెలంగాణలో అటవీ శాస్త్ర విశ్వ విద్యాలయం

ఛాన్సలర్‌గా ముఖ్యమంత్రి... సీఎం చేతుల్లోనే వీసీ నియామకం

 తెలంగాణలో మరో విశ్వవిద్యాలయం పురుడు పోసుకుంది. ఇప్పటివరకు సిద్దిపేట జిల్లా ములుగులో అటవీ కళాశాల మాత్రమే ఉండగా తాజాగా మంగళవారం అటవీ శాస్త్ర విశ్వవిద్యాలయ ఏర్పాటు బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రవేశపెట్టారు. ‘2016లో ములుగులో అటవీ కళాశాలతో పాటు పరిశోధన సంస్థ (ఎఫ్‌సీఆర్‌ఐ)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అటవీ విద్య, పరిశోధన, విస్తరణ, వ్యాప్తికి ఆ సంస్థను తెలంగాణ అటవీ శాస్త్ర విశ్వ విద్యాలయం(యూవోఎ్‌ఫ)గా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింద’ని మంత్రి తెలిపారు. దీనికి ముఖ్యమంత్రి చాన్సలర్‌గా వ్యవహరిస్తారని, ముఖ్యమంత్రి అధ్యక్షతనే స్నాతకోత్సవం నిర్వహించాలని బిల్లులో పొందుపరిచారు. వీసీని ఛాన్సలర్‌ హోదాలో ముఖ్యమంత్రి నియమించేలా అధికారాలు కల్పించారు. 

Updated Date - 2022-09-14T08:43:56+05:30 IST