తెలంగాణలో కుటుంబపాలన సాగుతోంది: Sanjeev kumar
ABN , First Publish Date - 2022-07-02T16:14:21+05:30 IST
తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి సంజీవ్ కుమార్ బాల్యన్ అన్నారు.
మెదక్: తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి సంజీవ్ కుమార్ బాల్యన్(Sanjeev kumar balyan) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం లో అవినీతి ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో, దేశంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతాయని తెలిపారు. మోదీ పథకాలు తెలంగాణలో అమలు చేయడం లేదన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే తెలంగాణ అభివృద్ధిలో ముందుకు సాగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణలో పథకాలు అమలు అవుతున్నాయని అన్నారు. పెట్రోల్, డీజిల్పై తెలంగాణ సర్కారు ట్యాక్స్ తగ్గించడం లేదని మండిపడ్డారు. తెలంగాణలో రాజరికం అమల్లో ఉందా అని కేంద్రమంత్రి సంజీవ్ కుమార్ ప్రశ్నించారు.