పందుల వ్యాన్‎ను హైజాక్ చేసిన గుర్తు తెలియని వ్యకులు

ABN , First Publish Date - 2021-07-02T13:01:08+05:30 IST

నగరంలో సినీఫక్కీలో పందుల వ్యాన్‎ను గుర్తు తెలియని వ్యక్తులు హైజాక్ చేశారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పోలీస్ ఎస్కార్ట్ వాహనం ద్వారా పందులను

పందుల వ్యాన్‎ను హైజాక్ చేసిన గుర్తు తెలియని వ్యకులు

విశాఖపట్నం: నగరంలో సినీఫక్కీలో పందుల వ్యాన్‎ను గుర్తు తెలియని వ్యక్తులు హైజాక్ చేశారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పోలీస్ ఎస్కార్ట్ వాహనం ద్వారా పందులను వ్యాన్‎లో అధికారులు తరలిస్తున్నారు. పందుల వ్యాన్‎ను దుండగులు హైజాక్ చేశారు. పోలీస్ ఎస్కార్ట్ వాహనం ఉన్నప్పటికీ వ్యాన్‎ను 20 మంది దుండగులు అడ్డగించారు. అనంతరం వ్యాన్‎లో ఉన్న డ్రైవర్‎ను బయటకు లాగేసి..వ్యాన్‎ను ఎత్తుకెళ్లారు. దుండగులు ఎత్తుకెళ్లిన పందుల వ్యాన్‎ను పోలీసులు వెంబండించారు. పోలీసులు వెంబడిస్తున్నట్లు తెలుసుకున్న దుండగులు చిత్తూరు వరకు వ్యాన్‎ను తీసుకువెళ్లి అక్కడే వ్యాన్ వదిలి పరారయ్యారు. సీసీటీవీ పుటేజ్ ఆధారంగా పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. 

Updated Date - 2021-07-02T13:01:08+05:30 IST