బాబు పర్యటనకు అనూహ్య స్పందన
ABN , First Publish Date - 2022-05-20T08:48:23+05:30 IST
ఉమ్మడి కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటనకు అనూహ్య స్పందన లభించింది. వెల్దుర్తి మండలం భూమిరెడ్డిపల్లె, డోన్ పట్టణాల్లో రోడ్ షోలకు అపూర్వ స్పందన వచ్చింది. ఎక్కడకు వెళ్లినా జనం జేజేలు పలికారు. షెడ్యూల్ ప్రకారం డోన్ రోడ్షో లేదు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటనకు అనూహ్య స్పందన లభించింది. వెల్దుర్తి మండలం భూమిరెడ్డిపల్లె, డోన్ పట్టణాల్లో రోడ్ షోలకు అపూర్వ స్పందన వచ్చింది. ఎక్కడకు వెళ్లినా జనం జేజేలు పలికారు. షెడ్యూల్ ప్రకారం డోన్ రోడ్షో లేదు. అయితే.. చంద్రబాబును చూసేందుకు భారీగా జనం రావడంతో ఆయన రోడ్షో నిర్వహించి మాట్లాడారు. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా జనం ఆయన వెంట నడిచారు. జలదుర్గంలో బాదుడే బాదుడుకు పక్క గ్రామాల నుంచి కూడా భారీగా తరలి వచ్చారు. ఆయా కార్యక్రమాల్లో టీడీపీ కర్నూలు, నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకటరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకా్షరెడ్డి, ఎమ్మెల్సీలు కేఈ ప్రభాకర్, బీటీ నాయుడు, నంద్యాల పార్టమెంట్ ఇన్చార్జి మాండ్ర శివానందారెడ్డి, నియోజకవర్గాల టీడీపీ ఇన్చార్జులు బీసీ జనార్దన్రెడ్డి, కె.మీనాక్షినాయుడు, కోట్ల సుజాతమ్మ, బీవీ జయనాగేశ్వరరెడ్డి, గౌరు చరిత, భూమా బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘‘ముందు గడపగడపకు వైసీపీ అన్నారు. తర్వాత ‘గడపగడపకు మన ప్రభుత్వం’ అని మార్చారు. జనం ఛీ కొడుతుండటంతో బస్సు యాత్ర అంటున్నారు. రేపు... గాలి యాత్ర చేస్తారేమో!’’
చంద్రబాబు