మీడియాను నియంత్రిస్తే పతనం ప్రారంభమైనట్టే: ఉండవల్లి

ABN , First Publish Date - 2020-02-19T20:58:24+05:30 IST

రాజమండ్రి: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని చానల్స్ ప్రసారాలను నిలిపివేశారని..

మీడియాను నియంత్రిస్తే పతనం ప్రారంభమైనట్టే: ఉండవల్లి

రాజమండ్రి: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని చానల్స్ ప్రసారాలను నిలిపివేశారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సాక్షి పేపరు, చానల్ లేదని, మీడియా మొత్తం రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకమని.. అయినా ఆయన ఏనాడు మీడియా జోలికి పోలేదని అన్నారు. మీడియాను ఆపేయాలనే ప్రయత్నం చేయలేదన్నారు. ఆయన డైరెక్టుగానే ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాశారని, ఆ రెండు పేపర్లు అంతేనని చెప్పేవారే తప్ప.. వాటిని ఆపాలనే ప్రయత్నం చేయలేదన్నారు. 


ఇప్పుడు రాజమండ్రిలో రెండు చానల్స్ రావడంలేదని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. తనకు తెలిసిన విషయం ఏమిటంటే జగన్ ప్రభుత్వమే ఆ రెండు చానల్స్‌ను ఆపమందని తెలిసిందన్నారు. ఇంతకుముందు తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కూడా ఇలాగే చేశారని అన్నారు. జగన్‌కు తెలియదేమో చానల్స్ నిలిపివేయడం చాలా తప్పని అన్నారు. వెంటనే రెండు చానళ్ల ప్రసారాలను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన వార్తలను చూసి భయపడిన మరుక్షణం పతనం ప్రారంభమైనట్టేనని ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు.


Updated Date - 2020-02-19T20:58:24+05:30 IST