Team Indiaలో ఉమ్రాన్ మాలిక్కు స్థానం..కశ్మీరులో సంబరాలు
ABN , First Publish Date - 2022-05-24T13:44:33+05:30 IST
దక్షిణాఫ్రికాతో జరగనున్న ఐదు టీ20 మ్యాచ్ సిరీస్కు జమ్మూకశ్మీర్ పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ ఎంపిక అనంతరం జమ్మూకశ్మీరులో ఆయన అభిమానులు, స్నేహితులు, కుటుంబసభ్యులు సంబరాలు చేసుకున్నారు....
జమ్మూ: దక్షిణాఫ్రికాతో జరగనున్న ఐదు టీ20 మ్యాచ్ సిరీస్కు జమ్మూకశ్మీర్ పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ ఎంపిక అనంతరం జమ్మూకశ్మీరులో ఆయన అభిమానులు, స్నేహితులు, కుటుంబసభ్యులు సంబరాలు చేసుకున్నారు. ఉమ్రాన్ మాలిక్ స్వగ్రామమైన గుజ్జర్ నగర్ లో వందలాదిమంది ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఉమ్రాన్ మాలిక్ ఇల్లు బంధువులు, పొరుగువారు, స్నేహితులతో నిండిపోయింది.టీమిండియాలో ఉమ్రాన్ ఎంపిక అయిన కొద్దిసేపటికే వందలాదిమంది అభిమానులు రోడ్లపైకి వచ్చి డప్పులు కొడుతూ నృత్యాలు చేశారు.గుజ్జర్ నగర్ మొహల్లా వెల్ఫేర్ కమిటీ సభ్యులు ఈ సంబరాల్లో పాల్గొన్నారు.
తన కుమారుడు ఉమ్రాన్ తన కష్టంతో అందరినీ గర్వపడేలా చేశాడని అతని తండ్రి అబ్దుల్ రషీద్ చెప్పారు. ‘‘జమ్మూకశ్మీరుతోపాటు దేశం గర్వపడేలా ఉమ్రాన్ చేశాడు...కఠోర శ్రమ, అల్లా ఆశీస్సుల వల్లే అతడు క్రికెట్ జట్టులోకి ఎంపికయ్యాడు’’ అని అబ్దుల్ రషీద్ వ్యాఖ్యానించారు.తన కుమారుడు ఉమ్రాన్ మాలిక్కు మద్దతుగా నిలిచిన దేశప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.