ఎస్వీబీసీకి యూబీఐ రూ.50.50 లక్షల స్పాన్సర్షిప్
ABN , First Publish Date - 2021-01-24T08:58:11+05:30 IST
టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవేంకటేశ్వర భక్తి చానల్(ఎస్వీబీసీ)లో ఏడాది పాటు ఽధార్మిక, భక్తిప్రచార కార్యక్రమాలను ప్రసారం చేసేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.50,55,150 స్పాన్సర్షిప్ అందించింది.
తిరుమల: టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవేంకటేశ్వర భక్తి చానల్(ఎస్వీబీసీ)లో ఏడాది పాటు ఽధార్మిక, భక్తిప్రచార కార్యక్రమాలను ప్రసారం చేసేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.50,55,150 స్పాన్సర్షిప్ అందించింది. బ్యాంకు ఎండీ, సీఈవో రాజ్కిరణ్ రాయ్ సూచనల మేరకు తిరుపతి డీజీఎం దత్తాత్రేయ వెంకటేశ్వరశర్మ స్పాన్సర్షిప్ డీడీని శనివారం తిరుమలలో టీటీడీ అదనపు ఈవో, ఎస్వీబీసీ ఎండీ ధర్మారెడ్డికి అందజేశారు.