యూఏఈలో 473 పాజిటివ్ కేసులు.. 399 రిక‌వ‌రీలు

ABN , First Publish Date - 2020-07-11T15:17:57+05:30 IST

గ‌ల్ఫ్ దేశ‌మైన యూఏఈలో మ‌హ‌మ్మారి క‌రోనా కాస్తా త‌గ్గుముఖం ప‌డుతోంది.

యూఏఈలో 473 పాజిటివ్ కేసులు.. 399 రిక‌వ‌రీలు

యూఏఈ: గ‌ల్ఫ్ దేశ‌మైన యూఏఈలో మ‌హ‌మ్మారి క‌రోనా కాస్తా త‌గ్గుముఖం ప‌డుతోంది. శుక్ర‌వారం 473 కొత్త కేసులు న‌మోదు కాగా... 399 రిక‌వ‌రీలు న‌మోద‌య్యాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా కోవిడ్‌-19 సోకిన వారి సంఖ్య 54,050కు చేరింది. అలాగే మొత్తం కోలుకున్న వారు 43,969 మంది అయ్యారు. ఇక నిన్న సంభ‌వించిన రెండు మ‌ర‌ణాల‌తో క‌లిపి ఇప్ప‌టివ‌ర‌కు యూఏఈ వ్యాప్తంగా ఈ వైర‌స్ 330 మందిని బ‌లిగొంది. కాగా, ‌క్ర‌మంగా క‌రోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండ‌డంతో యూఏఈలో రిక‌వ‌రీ రేటు 81.32 శాతానికి చేరింది. ఇది ప్రపంచ సగటు రికవరీ రేటు 58.17 శాతం కంటే అధికంగా ఉండటం విశేషం. మ‌రోవైపు యూఏఈ ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ముమ్మ‌రంగా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తోంది. ఆగ‌స్టు నెలాఖ‌రు వ‌ర‌కు ఆరు మిలియ‌న్ల కోవిడ్ టెస్టులు పూర్తి చేసేందుకు ల‌క్ష్యంగా పెట్టుకుంది. 

Updated Date - 2020-07-11T15:17:57+05:30 IST