యూఏఈలో స్వల్పంగా పెరిగిన పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2020-08-09T14:28:59+05:30 IST
కోవిడ్-19 నుంచి యూఏఈ క్రమంగా కోలుకుంటోంది. పాజిటివ్ కేసులు తగ్గి... కోలుకుంటున్న వారు పెరుగుతున్నారు. దీంతో ఇప్పటికే 90 శాతం రికవరీ రేటు నమోదు చేసింది.
యూఏఈ: కోవిడ్-19 నుంచి యూఏఈ క్రమంగా కోలుకుంటోంది. పాజిటివ్ కేసులు తగ్గి... కోలుకుంటున్న వారు పెరుగుతున్నారు. దీంతో ఇప్పటికే 90 శాతం రికవరీ రేటు నమోదు చేసింది. కాగా, శనివారం యూఏఈలో పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. 230 రికవరీలు నమోదు కాగా... 239 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 62,300కు చేరితే... మొత్తం కోలుకున్నవారు 56,245 మంది అయ్యారు. అయితే, గడిచిన 24 గంటల్లో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. ఇక ఇప్పటికే యూఏఈ వ్యాప్తంగా 356 మందిని ఈ మహమ్మారి బలిగొంది. ప్రస్తుతం దేశంలో 5,699 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మరోవైపు ఈ వైరస్ వ్యాప్తి నియంత్రణకు ముమ్మరంగా కోవిడ్ టెస్టులు చేస్తున్న యూఏఈ... శనివారం కూడా 63,792 పరీక్షలు నిర్వహించింది. దీంతో ఇప్పటికే 5 మిలియన్లకు పైగా కరోనా పరీక్షలు పూర్తి చేసింది. ఈ నెలాఖరు వరకు ఆరు మిలియన్ల కోవిడ్ టెస్టులు పూర్తి చేయాలని ఆరోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇలా విరివిగా కరోనా పరీక్షలు నిర్వహించడం వల్లే ఈ మహమ్మారిని కట్టడి చేశామని యూఏఈ చెబుతోంది.