హైదరాబాద్లో ఒక మహిళ, ఇద్దరు యువతుల అదృశ్యం
ABN , First Publish Date - 2021-04-18T16:31:16+05:30 IST
వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు కనిపించకుండా పోయారు.
హైదరాబాద్/బంజారాహిల్స్ : వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు కనిపించకుండా పోయారు. ఫిలింనగర్కు చెందిన మొగసాని శ్రీకాంత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నారపల్లి నుంచి అతని తల్లి ఉమాదేవి ఈ నెల 15న నగరానికి బయలుదేరింది. సికింద్రాబాద్ బస్టాండ్లో బస్ దిగిన తర్వాత ఫోన్ కూడా చేసింది. తర్వాత ఆమె ఫోన్ పని చేయలేదు. సికింద్రాబాద్ బస్టాండ్ పరిసరాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో శ్రీకాంత్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
శ్రీనగర్కాలనీలో యువతి..
శ్రీనగర్కాలనీకి చెందిన బి.పుల్లమ్మ ఇళ్లలో పనిచేస్తోంది. ఆమె కుమార్తె బి. ఉమాలత ఓ ఆస్పత్రిలో నర్సు. ఈ నెల 15న పులమ్మ పని మీద బయటకు వెళ్లింది. తిరిగొచ్చే సరికి ఉమాలత ఇంట్లో కనిపించలేదు. ఆమె ఫోన్ ఇంట్లోనే వదిలి వెళ్లడంతో పరిశీలించగా, ఓ యువకుడి ఫోన్ నంబరు కనిపించింది. ఆ నంబర్కు ఫోన్ చేయగా, స్పందించలేదు. పలుచోట్ల వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మరో చోట.. యువతి
యూసుఫ్గూడ హౌలంకాలనీకి చెందిన రహీమున్సీసా చీరల వ్యాపారం చేస్తోంది. ఆమె కుమార్తె రేష్మా పఠాన్ ఈ నెల 16 బయటకు వెళ్లి, తిరిగి రాలేదు. తల్లి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.