ఖాకీలు పీకల దాక మద్యం తాగి...డబ్బు డిమాండ్ చేసి...

ABN , First Publish Date - 2020-02-09T16:05:51+05:30 IST

పీకల దాకా మద్యం తాగి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు పోలీసుకానిస్టేబుళ్లను పోలీసులు అరెస్టు చేసిన ఘటన....

ఖాకీలు పీకల దాక మద్యం తాగి...డబ్బు డిమాండ్ చేసి...

పట్నా(బీహార్): పీకల దాకా మద్యం తాగి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు పోలీసుకానిస్టేబుళ్లను పోలీసులు అరెస్టు చేసిన ఘటన బీహార్ రాష్ట్రంలోని పాటలీపుత్ర నగరంలో వెలుగుచూసింది. పాటలిపుత్ర కారు డ్రైవరుతోపాటు మరో పోలీసు కానిస్టేబుల్ పీకలదాక మద్యం తాగి తమను రూ.2లక్షలు ఇవ్వాలని బెదిరించారని ఫిర్యాదు చేశారు. దీంతో పాటలిపుత్ర ఎస్ఐ కామేశ్వర్ ప్రసాద్ సింగ్ రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లకు బ్రెత్ ఎనలైజర్ పరీక్షలు చేయగా వారు మద్యం తాగారని తేలింది. వారి వద్ద మద్యం గ్లాసులు కూడా కనిపించాయి. దీంతో మందుబాబులైన ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్టు చేశారు.

Updated Date - 2020-02-09T16:05:51+05:30 IST