మనీ లాండరింగ్కు పాల్పడ్డ కేసులో భారత సంతతి వ్యక్తులకు జైలు!
ABN , First Publish Date - 2020-05-30T20:56:42+05:30 IST
మనీ లాండరింగ్కు పాల్పడిన ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు బ్రిటన్ కోర్టు జైలు శిక్ష విధించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. భారత సంతతికి చెందిన విజయ కుమార్ కృ
లండన్: మనీ లాండరింగ్కు పాల్పడిన ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు బ్రిటన్ కోర్టు జైలు శిక్ష విధించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. భారత సంతతికి చెందిన విజయ కుమార్ కృష్ణసామి (32), చంద్రశేఖర్ నల్లయాన్(44).. 2.4 మిలియన్ పౌండ్ల(దాదాపు రూ.22.38 కోట్ల) మనీ లాండరింగ్కు పాల్పడినట్లు స్కాట్లాండ్కు చెందిన ఎకనమిక్ క్రైమ్ యూనిట్ కేసు నమోదు చేసింది. అంతేకాకుండా వీరిద్దరూ మరో 1.6 మిలియన్ పౌండ్ల (దాదాపు రూ. 14.91 కోట్ల) మనీ లాండరింగ్కు పాల్పడే ప్రయత్నంలో ఉన్నట్లు ఎకనమిక్ క్రైమ్ యూనిట్ తన విచారణలో గుర్తించింది. ఈ నేపథ్యంలో బ్రిటన్ అధికారులు వీరిద్దరినీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. ఇద్దరినీ దోషులుగా తేల్చింది. అంతేకాకుండా ఇద్దరికీ కలిపి 12 సంవత్సరాల 9 నెలల జైలు శిక్షను విధించింది. ఇందులో చంద్రశేఖర్ నల్లయాన్కు ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడగా.. విజయ కుమార్ కృష్ణసామికి ఐదు సంవత్సరాల జైలు శిక్షను కోర్టు విధించింది.