ఇద్దరు రైతుల ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-02-24T09:15:05+05:30 IST
రాష్ట్రంలో అప్పుల బాధతో ఇద్దరు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కౌలు రైతు చిలుకా ప్రతాప్(40) ఐదు ఎకరాల పొలం కౌలుకు
అచ్చంపేట/ఎమ్మిగనూరు రూరల్, ఫిబ్రవరి 23: రాష్ట్రంలో అప్పుల బాధతో ఇద్దరు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కౌలు రైతు చిలుకా ప్రతాప్(40) ఐదు ఎకరాల పొలం కౌలుకు తీసుకొని మిర్చి, పత్తి సాగు చేస్తున్నాడు. కాగా.. ఇప్పటివరకు చేసిన అప్పులు సుమారు రూ.9లక్షలకు చేరాయి. ఈ నేపథ్యంలో మిర్చి మొదటి కోతలో మూడు వంతులు తాలుగా మారడంతో తట్టుకోలేని ప్రతాప్ శనివారం సాయంత్రం పొలంలో పురుగు మందు తాగాడు. బంధువులు అచ్చంపేటలో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మరోవైపు అప్పుల బాధతో కర్నూలు జిల్లాలో ఆత్మహత్యాయత్నం చేసిన ఓ యువరైతు ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.