వాగులో చిక్కుకున్న దంపతులు.. రక్షించాలని కేసీఆర్కు ఎమ్మెల్యే ఫోన్
ABN , First Publish Date - 2020-09-17T00:09:03+05:30 IST
డిండి వాగులో ఇద్దరు రైతులు చిక్కుకున్నారు. సిద్ధాపూర్ గ్రామానికి చెందిన దంపతులుగా గుర్తించారు. దంపతులను
మహబూబ్నగర్: డిండి వాగులో ఇద్దరు రైతులు చిక్కుకున్నారు. సిద్ధాపూర్ గ్రామానికి చెందిన దంపతులుగా గుర్తించారు. దంపతులను కాపాడేందుకు హెలికాప్టర్ పంపాలని సీఎం కేసీఆర్ను ఎమ్మెల్యే బాలరాజు కోరారు. నిన్నటి నుంచి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, గుంటలు నిండిపోయాయి. పలు చోట్ల పంట పొలాలు కూడా నీటి మునిగిపోయాయి.