వైసీపీ, బీజేపీకి తిరుమల వేంకటేశునిపై భక్తి లేదు: తులసిరెడ్డి

ABN , First Publish Date - 2020-09-25T21:13:30+05:30 IST

అమరావతి: వైసీపీ, బీజేపీ రెండు ప్రియా పార్టీలు అని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసి రెడ్డి వ్యాఖ్యానించారు

వైసీపీ, బీజేపీకి తిరుమల వేంకటేశునిపై భక్తి లేదు: తులసిరెడ్డి

అమరావతి: వైసీపీ, బీజేపీ రెండు ప్రియా పార్టీలు అని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసి రెడ్డి వ్యాఖ్యానించారు. వైసీపీకి, బీజేపీకి వెంకటేశ్వర స్వామిపై నమ్మకం, భక్తి, గౌరవం లేవన్నారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానన్న పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. టీటీడీ రూల్ 136 ప్రకారం హిందుత్వానికి చెందని వ్యక్తి స్వామి దర్శనం చేసుకోవాలంటే స్వామివారిపై నమ్మకం ఉందని సంతకం పెట్టాలని తెలిపారు. ఏపీ సీఎం జగన్ సంతకం పెట్టలేదంటే స్వామివారిపై నమ్మకం లేనట్టేనని తులసిరెడ్డి విమర్శంచారు. 



Updated Date - 2020-09-25T21:13:30+05:30 IST