అమరావతిలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం: వైవీ సుబ్బారెడ్డి
ABN , First Publish Date - 2022-06-06T21:51:27+05:30 IST
అమరావతిలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం నిర్మించామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
అమరావతి: అమరావతిలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం నిర్మించామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈనెల 9న ప్రాణప్రతిష్ట, మహా సంప్రోక్షణ నిర్వహిస్తామని తెలిపారు. గవర్నర్ హరిచందన్, సీఎం జగన్, స్వరూపానందస్వామికి ప్రథమ దర్శనం కల్పిస్తామని తెలిపారు. టీటీడీ ఆలయాల్లో అమరావతిలోనిదే అతిపెద్ద నిర్మాణమన్నారు. తిరుమల ఆలయం తర్వాత అమరావతిలోని ఆలయమే అతిపెద్దదని పేర్కొన్నారు. రూ.40 కోట్లతో 25 ఎకరాల్లో శ్రీవారి ఆలయ నిర్మించామని పేర్కొన్నారు. ఆర్టీసీతో మాట్లాడి బస్సు సౌకర్యం కల్పిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.