రోజూ 50వేల ఆహారపొట్లాల పంపిణీ
ABN , First Publish Date - 2020-03-29T10:03:16+05:30 IST
తిరుపతి నగరంలో రోగులు, నిరాశ్రయులు, నిరుపేదల ఆకలి తీర్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ముందుకొచ్చింది. గతంలో మాదిరిగానే రోజూ 50వేల మందికి...
- రోగులు, నిరాశ్రయుల ఆకలి తీర్చనున్న టీటీడీ
తిరుపతి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): తిరుపతి నగరంలో రోగులు, నిరాశ్రయులు, నిరుపేదల ఆకలి తీర్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ముందుకొచ్చింది. గతంలో మాదిరిగానే రోజూ 50వేల మందికి కడుపు నింపేలా 50వేల అన్నం పొట్లాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. శనివారం 20 వేల పొట్లాలు అందించిన టీటీడీ... ఆదివారం నుంచి 50వేల పొట్లాలు అందించనుంది. మరోవైపు కరోనా కట్టడికి కూడా సహకారమందించాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్కుమార్ సింఘాల్ నిర్ణయించారు. ఇందులో భాగంగా దేవస్థానానికి చెందిన పద్మావతీ మెడికల్ కాలేజీ హాస్పిటల్ను కొవిడ్-19 ఆస్పత్రిగా మార్చేందుకు అంగీకరించారు. బర్డ్ ఆస్పత్రిలో కూడా కరోనా రోగులకు చికిత్స అందించాలని నిర్ణయించారు.