కవిత, కేటీఆర్‌కు జైలు తప్పదు

ABN , First Publish Date - 2022-09-23T09:21:21+05:30 IST

కవిత, కేటీఆర్‌కు జైలు తప్పదు

కవిత, కేటీఆర్‌కు జైలు తప్పదు

నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ 


న్యూఢిల్లీ, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ప్రాజెక్టులు ఇవ్వడం, వాటికి కమీషన్లు తీసుకోవడం సీఎం కేసీఆర్‌కు అలవాటైపోయిందని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. ఎనిమిదేళ్లుగా ఆయన పని ఇదేనని ధ్వజమెత్తారు. కుంభకోణాల్లో మునిగిపోయి రేపోమాపో జైల్లో చిప్పకూడు తినబోయే వ్యక్తి కొడుకుని, కూతురుని తాము సీరియ్‌సగా తీసుకోబోమని చెప్పారు. గురువారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. బీజేపీ వారు జోకర్లు అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేసిన విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా.. బీజేపీని జోకర్లు అని విమర్శించేముందు ఆయన తండ్రి ఒక బ్రోకర్‌ అన్న విషయాన్ని కేటీఆర్‌ గుర్తు చేసుకోవాలని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువగా పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎ్‌ఫఐ) సానుభూతిపరులు అరెస్ట్‌ అవుతున్నారని ప్రశ్నించగా.. దీనికి ఓటు బ్యాంకు రాజకీయాలే కారణమని అర్వింద్‌ బదులిచ్చారు. అటు పీఎ్‌ఫఐకి ఇటు ఎంఐఎంకు మధ్య కేసీఆర్‌ బ్రోకరేజ్‌ చేస్తున్నారని మండిపడ్డారు. ఇక కేసీఆర్‌ కూతురు లిక్కర్‌ స్కాంలో రేపోమాపో జైలుకు వెళ్తుందని, ఫీనిక్స్‌ తదితర సంస్థలపై జరిగిన ఐటీ దాడుల్లో దొరికిన ఆధారాల మేరకు కేటీఆర్‌ కూడా జైలుకు వెళతాడని అన్నారు. ఈ సంస్థల్లో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్‌ జరిగిందని చెప్పారు. అతి భయంకరమైన ఉగ్రవాదులను ప్రోత్సహించే పార్టీ ఎంఐఎం అన్నారు. దీని వెనక కేసీఆర్‌, కేటీఆర్‌ బలంగా నిలబడ్డారని ఆరోపించారు. ఆయన కొడుకు, కూతురు జైలుకు వెళ్తారని అన్నారు. వాళ్ల కోసం జైళ్లు సిద్ధం చేసి పెట్టాలని జైళ్ల శాఖ మంత్రికి సూచించారు. కవితను జైలుకు పంపించే విషయంలో కేటీఆర్‌ హస్తం ఉందన్నారు. 

Updated Date - 2022-09-23T09:21:21+05:30 IST