29న పోలవరం ముంపుపై భేటీ
ABN , First Publish Date - 2022-09-23T08:44:16+05:30 IST
29న పోలవరం ముంపుపై భేటీ
పోలవరం ముంపు ముప్పుపై కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో 29న నాలుగు రాష్ట్రాల అధికారుల అత్యున్నతస్థాయి సమావేశం జరగనుంది. పోలవరం ప్రాజెక్టు ముంపు తీవ్రతపై అధ్యయనం చేయాలని ఒడిశా, ఛత్తీ్సగఢ్, తెలంగాణ రాష్ట్రాలు సుప్రీంకోర్టులో కేసు వేశాయి. న్యాయస్థానం సూచనలతో నాలుగు రాష్ట్రాల అధికారులు ఈ అంశంపై చర్చించనున్నారు.