డిగ్రీ కాలేజీల్లో చేరే గడువు పొడిగింపు
ABN , First Publish Date - 2022-09-23T08:21:30+05:30 IST
డిగ్రీ కాలేజీల్లో చేరే గడువు పొడిగింపు
హైదరాబాద్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): దోస్త్ ద్వారా డిగ్రీ కోర్సుల్లో సీట్లు పొందిన అభ్యర్థులు కాలేజీల్లో చేరే గడువును పొడిగించారు. ముందు నిర్ణయించిన గడువు ప్రకారం విద్యార్థులు ఈ నెల 22లోపు ఆయా కాలేజీల్లో ఆన్లైన్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంది. దీన్ని తాజాగా 23వ తేదీ వరకు పొడిగిస్తూ గురువారం దోస్త్ కన్వీనర్ ఓ ప్రకటన విడుదల చేశారు.
29 మంది జూనియర్ లెక్చరర్ల నియామకం
మినిమం టైంస్కేల్ పద్ధతిలో పనిచేయడానికి వీలుగా 29 మంది జూనియర్ లెక్చరర్లను నియమించారు. ఈ మేరకు గురువారం విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఖాళీగా ఉన్న పోస్టుల్లో ఈ లెక్చరర్లు పనిచేస్తారు.