గడ్డి అన్నారం మార్కెట్ తరలింపుపై హైకోర్టులో విచారణ
ABN , First Publish Date - 2022-03-15T23:52:08+05:30 IST
గడ్డి అన్నారం మార్కెట్ తరలింపుపై హైకోర్టులో
హైదరాబాద్: గడ్డి అన్నారం మార్కెట్ తరలింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. శుక్రవారం నాటికి మార్కెట్ ఖాళీ చేయాలని వ్యాపారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆస్పత్రి నిర్మాణానికి ఆటంకాలు సృష్టించడం దురదృష్టకరమని హైకోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు ధిక్కరణ కేసులో అధికారుల హాజరుకు హైకోర్టు మినహాయింపునిచ్చింది. గడ్డి అన్నారం మార్కెట్ తరలింపుపై విచారణను కోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.